Andhra Pradesh DGP: పట్టించుకోవడం లేదు... ఏపీ డీజీపీకి Ysrcp లేఖ



పట్టించుకోవడం లేదు... ఏపీ డీజీపీకి Ysrcp లేఖ

గత 15 రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ నేతలు లేఖ రాశారు.

Ysrcp కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని..

వీటిపై కంపైంట్స్ చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదు. మాకు ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.

టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి ప్రవేశిస్తున్నారు. 
ఈ రోజుకు రాష్ట్రంలోని 14 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల లోకి చొరబడ్డారు.
మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు.

టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు.

సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. అని లేఖలో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు శాంతిభద్రతలు ప్రమాదంలో పడేశారని...
వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండాపోయిందని తెలియజేసుకుంటున్నాం.
నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం..

అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు.