Six Years: ఆరేళ్ల బాలిక


ఆరేళ్ల బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల బాలిక పావని మిస్సింగ్ పై కేసు ( క్రైం నంబర్ 108/2024) నమోదు చేశామని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 

ఈరోజు మధ్యహ్మాం అంగడికి వెళ్లొస్తానని చెప్పి బయటికెళ్లిన తన కూతురు పావని సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని ఆ అమ్మాయి తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడన్నారు. 

బాలిక మిస్సింగుపై దర్యాప్తు ప్రారంభించామని... జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆ అమ్మాయి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 

ఎవరికైనా ఆ బాలిక ఆచూకీ తెలిసినా, కనిపించినా వెంటనే తన ఫోన్ నంబర్ 94901 07853 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.